Kodi Katti Case: ఆ విషయాలు ఎన్ఐఏ చెప్పిందా?: మంత్రి బొత్స

by Disha Web Desk 16 |
Kodi Katti Case: ఆ విషయాలు ఎన్ఐఏ చెప్పిందా?: మంత్రి బొత్స
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కుట్ర కోణం లేదని ఎన్ఐఏ అధికారులు కోర్టుకు తెలిపారు. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని వెల్లడించారు. సీఎం జగన్ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును ఎన్ఐఏ అధికారులు కోరారు. దీంతో వైఎస్ జగన్‌పై టీడీపీ నేతలు ఆగ్రహం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకే జగన్ డ్రామా ఆడారని విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సీఎం జగన్‌పై దాడి చేసిన శ్రీనివాసరావును ఉన్మాది అంటూ సంబోధించారు. శ్రీనివాసరావు ఎందుకు దాడి చేశాడో ఎన్ఐఏ నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. జగనే దాడి చేయించుకున్నారని చంద్రబాబుకు ఎన్ఐఏ చెప్పిందా అని ప్రశ్నించారు.

Next Story