- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ క్రిస్టియనే.. క్షమాపణలు చెప్పను: మంత్రి అచ్చెన్నాయుడు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియనే తాను క్షమాపణలు చెప్పనని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. జగన్ క్రిస్టియనేనని తన వద్ద ఆధాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు..

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) క్రిస్టియనే తాను క్షమాపణలు చెప్పనని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) స్పష్టం చేశారు. జగన్ క్రిస్టియనేనని తన వద్ద ఆధాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీపై ఏపీ శాసనమండలి(Ap Legislative Coucil)లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా మండలి చైర్మన్ కూడా క్రిస్టియనేనన్న మాటలను అచ్చెన్నాయుడు వెనక్కి తీసుకున్నారు. అయితే మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాల్సిందే వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుపట్టారు. మండలిలో పెద్ద పెద్ద నినాదాలు చేశారు. ఇందుకు కౌంటర్గా అచ్చెన్న మాట్లాడుతూ ఆయన క్రిస్టియన్ కాదని జగన్ చెప్పమనాలన్నారు. టీటీడీకి ఎప్పుడూ కూడా జగన్ ఫ్యామిలీతో ఎందుకు రాలేదు. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు. హిందువులకు అప్రవిత్తత జరుగుతుంది. జగన్ ను ఎందుకు వెనకేసుకొస్తున్నారు. వైసీపీ చేసిన తప్పునకు హిందువులకు మంత్రి లోకేశ్ క్షమాపణలు చెప్పారు. ఏసు ప్రభుకు అన్యాయం చేశారని జగన్ లేఖ విడుదల చేశారు. ఏసు క్రీస్తూనే దేవుడా.. వెంకటేశ్వరస్వామి దేవుడు కాదా.’’ అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.






