భారీగా పెరిగిన కరోనా కేసులు.. రోజురోజుకి విస్తరిస్తున్న వైరస్‌

by Web Desk |
భారీగా పెరిగిన కరోనా కేసులు.. రోజురోజుకి విస్తరిస్తున్న వైరస్‌
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 46,650 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 14,440 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,80,634 చేరుకుంది. అయితే గత 24 గంటల్లో మహమ్మారి కారణంగా తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,542 గా ఉంది. ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో 83,610 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,21,47031 సాంపిల్స్‌‌ని పరీక్షించడం జరిగిందని వైద్యఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రజలంతా కరోనా ఆంక్షలు పాటిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు కోరుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో అధికారులు మరింత అప్రమత్తం అవుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో సైతం వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో, ఎక్కడిక్కడ మాస్క్‌ ధారణ తప్పనిసరి చేశారు.



Next Story

Most Viewed