ఏపీ లీగల్‌ సెల్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మానవేంద్రనాథ్‌ రాయ్‌.. అధికారిక ఉత్తర్వులు జారీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-10 08:02:54  IST  )

ఆంధ్రప్రదేశ్ న్యాయ శాఖలో పరిపాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఏపీ లీగల్‌ సెల్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మానవేంద్రనాథ్‌ రాయ్‌.. అధికారిక ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ న్యాయ శాఖలో పరిపాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు లీగల్‌ సెల్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌ రాయ్‌‌ (Justice CH Manavendranath Roy)ని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ న్యాయశాఖ కార్యదర్శి గొట్టపు ప్రతిభా దేవి ఇవాళ ఆధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవలే గుజరాత్‌ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. అయితే, మరికాసేపట్లో ఆయన సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)లతో భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story