- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మదనపల్లె కిడ్నీ మార్పిడి కేసు.. లొంగిపోయిన డాక్టర్
మదనపల్లె కిడ్నీ మార్పిడి కేసులో రెండో ప్రధాన ముద్ధాయి లొంగిపోయాడు. ఈ కేసులో ఏ2గా బెంగుళూరుకు చెందిన డాక్టర్ పార్థసారథి ఉన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మదనపల్లె కిడ్నీ మార్పిడి కేసులో రెండో ప్రధాన ముద్ధాయి లొంగిపోయాడు. ఈ కేసులో ఏ2గా బెంగుళూరుకు చెందిన డాక్టర్ పార్థసారథి ఉన్నారు. ఆయన కోర్టులో లొంగిపోవడంతో 14 రోజులు రిమాండ్ విధించారు. ఇప్పటికే ఈ కేసులో 8మంది నిందితులు అరెస్ట్ అవ్వగా మదనపల్లె సబ్ జైలులో ఉన్నారు. ఇక మరికొందరిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
కిడ్నీ డోనర్ నుండి రిసీవర్ వరకు కొంతమంది దళారులు ముఠాగా ఏర్పడి వ్యాపారం చేస్తున్నారు. మదనపల్లె నుండి బెంగళూరుకు కిడ్నీలను తరలించి అక్కడి ఆస్పత్రుల్లో రోగులకు అమరుస్తున్నారు. ఈ క్రమంలోనే వైజాగ్ కు చెందిన ముగ్గురకి డబ్బులు ఎరగా చూపి కిడ్నీలను బెంగుళూరు తరలించే ప్రయత్నం చేశారు. అయితే కిడ్నీ డోనర్ యమున చనిపోవడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇందులో డాక్టర్లు, టెక్నీషియన్లు సహా చాలా మంది ఉన్నారు.






