లారీ డ్రైవర్ చాకచక్యం: ప్రాణాలు పోతున్నా పెను ప్రమాదాన్ని తప్పించాడు

by Disha Web Desk 21 |
లారీ డ్రైవర్ చాకచక్యం: ప్రాణాలు పోతున్నా పెను ప్రమాదాన్ని తప్పించాడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : టైల్స్ లోడ్‌తో విజయనగరం వెళ్తుంది ఆ లారీ. అయితే కొంతదూరం వెళ్లేసరికి డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన లారీ డ్రైవర్ లారీని పక్కు ఆపి కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన క్లీనర్ అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. డ్రైవర్ తన ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పెను ప్రమాదం నుంచి తప్పించారని అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా కోడూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన సాహూ గోపి (55) లారీ డ్రైవర్. విజయనగరం టైల్స్ లోడ్ తో బయలుదేరాడు. అయితే రాగంపేట శివారు పెనుగండేపల్లి మండలం నీలాద్రి రావుపేటకు వచ్చేసరికి గుండెనొప్పికి గురయ్యాడు. దీంతో ఎంతో చాకచక్యంగా లారీని పక్కు తీసి కుప్పకూలిపోయాడు. దీంతో క్లీనర్ మరో డ్రైవర్ సహాయంతో దగ్గరలోని ఆదిత్య ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే గోపి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంలో మృతదేహాన్ని లారీలోనే ఉంచి బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.



Next Story

Most Viewed