సీఎంకు ఉన్న జబ్బు బయటపెట్టిన లోకేశ్

by Disha Web Desk 5 |
సీఎంకు ఉన్న జబ్బు బయటపెట్టిన లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ని ఒక జబ్బు ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవ్వాల నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రారంభించిన శంఖరావం సభలో మాట్లడుతూ.. సీఎం జగన్ ఒక పిచ్చోడని, ఊరూరు తిరుగుతూ.. నాకు డబ్బు లేదు.. డబ్బు లేదని అంటున్నాడని తెలిపారు. అతనికి ఒక జబ్బు ఉందని, దాని పేరు మైతోమేనియా సిండ్రోమ్ అని తెలిపారు.

ఈ జబ్బు ఉన్నవారు.. ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చెబుతారని అన్నారు. జగన్ కి సొంత టీవీ ఉన్నా లేదని, ప్యాలెస్ లు ఉన్నా లేవని, వేల కోట్లు అక్రమ ధనం ఉన్నా లేదని చెబుతున్నారని అన్నారు. అలాగే తనకు ప్రజాధరణ లేకున్నా ఉందని, ఈ సారి గెలిచే అవకాశం లేకున్నా ఉందని చెప్పుకుంటున్నారని ఇవన్నీ ఆ జబ్బు లక్షాణాలే అని ఎద్దేవా చేశారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా శంఖారావం అనే కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర నుంచి నారా లోకేశ్ ప్రారంభించారు.

Read More..

ఒకే సారి 175 అనే ఫార్ములాతో చంద్రబాబు.. సక్సెస్ రేటు ఎంతో..?

Next Story

Most Viewed