అమరావతి నిర్మాణానికి రూ.7,500 కోట్ల రుణం మంజూరు

by Muthe.Rajitha |

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది.

అమరావతి నిర్మాణానికి రూ.7,500 కోట్ల రుణం మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. అమరావతి నిర్మాణానికి రూ.7,500 కోట్ల రుణం మంజూరు చేసింది నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్(NaBFID). కాగా ఇందుకు సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారాయణ సమక్షంలో CRDA కమిషనర్ కన్నబాబుకు బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సామ్యూల్ జోసెఫ్ అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయడంలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.

Next Story