ఏరువాక వేళ విషాదం.. తుంగభద్ర నదిలో మునిగి రెండు ఎద్దుల మృతి

by Ramesh Naini |

కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఏరువాక పౌర్ణమి వేడుకల సందర్భంగా విషాదం చోటుచేసుకుంది.

ఏరువాక వేళ విషాదం.. తుంగభద్ర నదిలో మునిగి రెండు ఎద్దుల మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఏరువాక పౌర్ణమి వేడుకల సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. రైతు సురేశ్ తన ఎద్దులను తుంగభద్ర నదిలో స్నానం చేయిస్తుండగా రెండు ఎద్దులు నీటిలో మునిగి మృతి చెందాయి. కుటుంబ సభ్యుల్లా చూసుకునే ఎద్దులను కోల్పోవడంతో రైతు సురేశ్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి వారిని కలిచివేశాయి.

Next Story