మహిళలకు టీడీపీ గుడ్ న్యూస్.. త్వరలో సరికొత్త పథకం

by Disha Web Desk 16 |
మహిళలకు టీడీపీ గుడ్ న్యూస్.. త్వరలో సరికొత్త పథకం
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ మహిళలకు టీడీపీ గుడ్ న్యూస్ తెలిపింది. మహిళా దినోత్సవం సందర్భంగా సరికొత్త పథకాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ‘కలలకు రెక్కలు’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకానికి ఇంటర్ చదివిన విద్యార్థులు, మహిళలను అర్హులని స్పష్టం చేసింది. ఈ పథకం కింద అర్హులకు బ్యాంకు లోన్ ఇప్పించనుంది. ఈ లోన్‌కు బ్యాంకు వడ్డీ కట్టే బాధ్యతను టీడీపీ, జనసేన పార్టీ ప్రభుత్వం తీసుకోనుంది. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వెల్లడించారు. .


మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటర్ విద్యార్థినులకు నారా భువనేశ్వరి శుభ వార్త తెలిపారు. ఇంటర్ పూర్తి చేసుకుని ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకునే విద్యార్థులకు ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంక్ లోన్ ఇప్పించననున్నట్లు తెలిపారు. విద్యార్థినులు చెల్లించాల్సిన బ్యాంకు వడ్డీని పూర్తి టీడీపీ-జనసేన ప్రభుత్వం చెల్లిస్తుందని భువనేశ్వరి తెలిపారు.

కాగా కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటిస్తున్న ఆమె .. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ‘నిజం గెలవాలి’అంటూ పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల్లో భువనేశ్వరి యాత్ర చేపట్టారు.

Next Story

Most Viewed