Kurnool: బీజేపీ ఎంపీని తక్షణమే అరెస్టు చేయాలి

by Disha Web Desk 16 |
Kurnool: బీజేపీ ఎంపీని తక్షణమే అరెస్టు చేయాలి
X

దిశ, కర్నూలు అర్బన్: రెజ్లర్ల క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్‌పై ఫోక్సో చట్టం కింద అరెస్టు చేయాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా, సీఐటీయూ, రైతుసంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్‌లో రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కర్నూలు అవుట్ డోర్ స్టేడియం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేశారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాధాకృష్ణ, అంజిబాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, ఐద్వా జిల్లా కార్యదర్శి అలివేలు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ రెజ్లర్ల క్రీడాకారులు 26 రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్నా.. బీజేపీ నాయకులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, సంతకాల సేకరణలు చేస్తున్నామని తెలిపారు. లైంగిక వేధింపులకు బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Next Story

Most Viewed