Nandyala: క్రషర్ యాజమాని కుటుంబం కిడ్నాప్.. 11 మంది అరెస్ట్

by Disha Web Desk 16 |
Nandyala: క్రషర్ యాజమాని కుటుంబం కిడ్నాప్.. 11 మంది అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లాలో జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. బనగానపల్లెకు చెందిన క్రషర్ యజమాని నాగిరెడ్డి కుమారుడు వినాయకరెడ్డి, మనవడు భరత్ కుమార్ రెడ్డి, డ్రైవర్ సాయినాథ్ రెడ్డిని దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే ఈ కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.40 లక్షలు స్వాధీనం చేశారు. నాలుగు కార్లు, కత్తిని సీజ్ చేశారు. మరికొంతమంది పరారీలో ఉన్నారని తెలిపారు. బేతంచర్ల వద్ద ముగ్గురుని కిడ్నాప్ చేసిన దుండగులు రూ.4 కోట్లు డిమాండ్ చేశారు. అయితే కిడ్నాపర్లు అడిగిన మొత్తాన్ని రెండు విడుతలుగా చెల్లించారు. కానీ కిడ్నాప్ చేసిన ముగ్గురినీ వదలకపోవడంతో క్రషర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అయితే కిడ్నాప్ చేసిన ప్రధాన సూత్రదారి గతంలో క్రషర్ యజమాని నాగిరెడ్డి వద్ద పని చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed