Nandyala: జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. త్వరలో 18,500 గృహాల అందజేత

by Disha Web Desk 16 |
Nandyala: జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. త్వరలో 18,500 గృహాల అందజేత
X

దిశ, నంద్యాల: జగనన్న లేఔట్లలో జులై నెలాఖరు నాటికి 18,500 గృహాలు పూర్తి చేయాలని హౌసింగ్ ఇంజనీర్లు, మండల అధికారులను కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. జగనన్న లేఔట్లలో గృహ నిర్మాణాల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కేటాయించిన 18,500 గృహాల లక్ష్యంలో భాగంగా ఇప్పటివరకు 14,200 గృహాలు పూర్తయ్యాయన్నారు. మిగిలినవి జులై నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పూర్తయిన వాటికి ఎప్పటికప్పుడు ఎక్స్‌పెండేచర్ బుక్ చేయాలని హౌసింగ్ ఇంజనీర్లు, సచివాలయ సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. ఇంకా ప్రారంభించని గృహాలను వెంటనే గ్రౌండింగ్‌లోకి తీసుకురావాలని హౌసింగ్ అధికారులకు సూచించినట్లు కలెక్టర్ తెలిపారు.



Next Story

Most Viewed