Kurnool: జనసేన బీమా... కార్యకర్తలకు ధీమా...

by Disha Web Desk 16 |
Kurnool: జనసేన బీమా... కార్యకర్తలకు ధీమా...
X

దిశ, ఆళ్లగడ్డ : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పవన్ కల్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి జనసేన సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు మైలేరి మల్లయ్య మాట్లాడుతూ జనసేన కార్యకర్తల కుటుంబాలను అండగా నిలవడానికి పవన్ కళ్యాణ్ బీమా సౌకర్యం కల్పించారని తెలిపారు. జీవిత బీమా 5 లక్షల రూపాయలు కాగా ప్రమాదవశాత్తు గాయపడిన వారికి 50 వేల రూపాయలు జనసేన తరఫున బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 28 వరకు సభ్యత కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. నీతి, నిజాయితీ, నిబద్ధత గల నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. రెండు సంవత్సరాల నుంచి ప్రమాదవశాత్తు 96 మంది జనసేన కార్యకర్తల మరణించారని తెలపారు. వారి కుటుంబాలకు 4 కోట్ల 80 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు గాయపడిన 169 మంది కార్యకర్తలకు 60 లక్షల 90 వేల రూపాయలు జీవిత బీమా కింద 5 కోట్ల 40 లక్షల 90 వేల రూపాయలు అందజేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు దేవా ఆంజనేయులు, నీరుకట్టు వెంకటరామయ్య, బావికాడి గుర్రప్ప, సజ్జల నాగేంద్ర, దూరం చైతన్య పాల్గొన్నారు.



Next Story

Most Viewed