- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dhone: విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం
by Vemula.Srinu Prasad |
ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిందని,..

X
దిశ, డోన్: ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీసీ డిపో మేనేజర్ మల్లాది శశిభూషణ్ తెలిపారు. స్థానిక డిపోలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 3 నుంచి 18వ తేదీ వరకు పల్లెవెలుగు బస్సల్లో తమ నివాస ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాల వరకు ఈ అవకాశం కల్పించిందన్నారు. అయితే ఈ అవకాశం పరీక్ష సమాయానికి రెండు గంటల ముందు, పరీక్ష అనంతరం రెండు గంటల తర్వాత వరకు మాత్రమే అనుమతించనున్నట్లు చెప్పారు. సెలవు రోజుల్లో ఈ సౌకర్యం ఉండదని తెలియజేశారు.
Next Story






