- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kurnool: పాలిష్ పేరుతో ఘరానా మోసం... ముగ్గురు యువకులకు దేహశుద్ధి
by Vemula.Srinu Prasad |
పాలిష్ పేరుతో గ్రామస్తులను నలుగురు యువకులు మోసం చేసేందుకు యత్నించారు...

X
దిశ, వెబ్ డెస్క్: పాలిష్ పేరుతో గ్రామస్తులను నలుగురు యువకులు మోసం చేసేందుకు యత్నించారు. ఆభరణాలకు మెరుగు పెడతామని యువకులు ఆదివారం కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంటకు వెళ్లారు. వెండికి మెరుగు పెడతామని స్థానికులను నమ్మించారు. ఈ క్రమంలో పాలిష్ చేయమని యువకులకు వెండిని ఇచ్చారు. అయితే పాలిష్ పెట్టే క్రమంలో వెండిని కొట్టేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్తులు నిలదీశారు. దొరికిపోయే సరికి నలుగురిలో ఓ యువకుడు అక్కడి నుంచి పారిపోయారు. మిగిలిన ముగ్గురికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న యువకుడి కోసం గాలిస్తున్నారు.
Next Story






