Breaking: కృష్ణా జిల్లా గూడూరులో హైటెన్షన్.. భారీగా చేరుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

by Disha Web Desk 16 |
Breaking: కృష్ణా జిల్లా గూడూరులో హైటెన్షన్.. భారీగా చేరుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా గూడూరు వైజంక్షన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబును స్వాగతించేందుకు గజమాల ఏర్పాటు చేశారు. అయితే అటు వైసీపీ కార్యక్తలు కూడా గూడూరు వైజంక్షన్ వద్దకు భారీగా చేరుకున్నారు. మంత్రి జోగి రమేశ్‌ను స్వాగతం పలికేందుకు భారీ గజమాల ఏర్పాటు చేశారు. పోటాపోటీ నినాదాలు ఆ ప్రాంతం దద్దరిల్లిపోతోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు. రెండువర్గాల మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తున్నారు. పరస్పరం ఎదురు పడకుండా ఉండేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎవరి కార్యక్రమం వారు నిర్వహించుకోవాలని టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు సూచించారు.

Next Story

Most Viewed