Vijayawada: ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. హాజరైన రజినీకాంత్

by Disha Web Desk 16 |
Vijayawada: ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. హాజరైన రజినీకాంత్
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు మాజీ సీఎం చంద్రబాబు, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు ఏపీ, తెలంగాణ టీడీపీ నేతలు హాజరయ్యారు. ప్రత్యేక అతిధిగా విచ్చేసిన రజినీకాంత్‌కు ఈ సందర్భంగా టీడీపీ నేతలు అభివాదం తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాన్ని రజినీ‌కాంత్ ఆవిష్కరణ చేసి బాలకృష్ణకు అందజేశారు. అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రజినీకాంత్‌కు తేనీటి విందు ఇచ్చారు. ఈ ఉదయం చెన్నై నుంచి విజయవాడ వచ్చిన రజినీకాంత్‌ను గన్నవరం ఎయిర్ పోర్టులో ఘనంగా స్వాగతం పలికారు.


Next Story

Most Viewed