నారా లోకేశ్ పాదయాత్ర వెనుక సీక్రెట్ అదే: Kodali Nani

by srinivas |
నారా లోకేశ్ పాదయాత్ర వెనుక సీక్రెట్ అదే: Kodali Nani
X
  • ఎన్టీఆర్ రక్తంతో పుట్టిన పార్టీ టీడీపీ
  • యువగళం సక్సెస్ కాదు.. లోకేశ్ ఎమ్మెల్యే కాలేడు
  • ఏ అర్హత ఉందని పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలి
  • - మాజీ మంత్రి కొడాలి నాని

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీపైనా, అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై విరుచుకుపడే నేతలలో మాజీమంత్రి కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. ఇతర నేతలకంటే కాస్త భిన్నంగా వీరిని తూర్పారపట్టడంలో కొడాలి నానికి మించిన వారు మరోకరుండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఛాన్స్ దొరికితే చాలు కొడాలి నాని విరుచుకుపడతారు. అయితే తాజాగా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రపై సన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఏ అర్హతతో లోకేశ్ పాదయాత్ర చేస్తున్నాడో చెప్పాలని నిలదీశారు. పాదయాత్ర చేయడం కన్నా ముందు ఎమ్మెల్యేగా ఎలా గెలవాలో ఆలోచించుకోవాలని కొడాలి నాని హితవు పలికారు. గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షనేతగా ఉండి పాదయాత్ర చేశారంటే ఒక అర్థం ఉంటుందని, ఓడిపోయిన వ్యక్తి పాదయాత్ర చేస్తే కనీసం ఆ పార్టీకి కూడా ఎలాంటి ఉపయోగం ఉండదని విమర్శించారు. లోకేశ్ పాదయాత్ర చేస్తే టీడీపీ అధికారంలోకి వచ్చే సీను ఉందా అని మాజీమంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. పోటీ చేసిన చోట ఓడిపోయిన పప్పు సుద్ద లోకేశ్ అంటూ ధ్వజమెత్తారు. పాదయాత్రలో ప్రజలకు లోకేశ్ ఏం చెప్తారని నిలదీశారు. వైఎస్ జగన్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసి విజయవంతం అయ్యారు. టీడీపీ హయాంలో మూడు శాఖలకు మంత్రిగా పని చేసిన లోకేశ్‌ను మంగళగిరి ప్రజలు ఓడించారు. అలాంటిది లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకి, చంద్రబాబుకు ఓరిగేదేమీ లేదన్నారు. లోకేశ్‌లాంటి వ్యక్తులు వచ్చి యాత్రలు చేస్తే వైసీపీ గెలుపు ఇక నల్లేరు మీద నడకేనని మాజీమంత్రి కొడాలి నాని చెప్పారు.

పాదయాత్ర వెనుక ఉద్దేశం టీడీపీలో వారసత్వం కోసమేనని కొడాలి నాని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎన్టీఆర్ రక్తంతో పుట్టిన పార్టీ అని.. ఎన్టీఆర్ వారసుల నుంచి లాక్కొనేందుకే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని మాజీమంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. నందమూరి కుటుబంలో ఎన్టీఆర్ వారసులు మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్లంతా మళ్లీ టీడీపీని ఎక్కడ లాగేసుకుంటారోనన్న భయంతోనే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని కొడాలి నాని చెప్పారు. లోకేశ్ చేస్తున్న పాదయాత్ర విజయవంతం కాదని ఫెయిల్ అవుతుందన్నారు. పాదయాత్రలు చేసినా ఏం చేసినా లోకేశ్ 2024 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే కాలేరని విమర్శించారు. ఒకవైపు లోకేశ్ రాజకీయాల్లో ఫెయిల్ అవ్వడం..చంద్రబాబుకు వయసు అయిపోవడంతో వచ్చే రోజుల్లో నందమూరి వారసులే టీడీపీని తమ చేతుల్లోకి తీసుకుంటారని మాజీమంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు.

Next Story

Most Viewed