విజయవాడలో కారు బీభత్సం.. జనం పైకి దూసుకెళ్లి ..!

by Vemula.Srinu Prasad |

విజయవాడలో జనాలపైకి దూసుకెళ్లి కారు బీభత్సం సృష్టించింది...

విజయవాడలో కారు బీభత్సం.. జనం పైకి దూసుకెళ్లి ..!
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ భవానీపురం బెరంపార్క్(Vijayawada Bhawanipuram Beram Park) సమీపంలో భారీ ప్రమాదం తప్పింది. జనంపైకి వేగంగా దూసుకెళ్లి కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో బాలుడితో పాటు ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీంతో కారు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రంకెన్ పరీక్షలో అధిక శాతం నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిందితుడిని సోమవారం కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. రోజు మాదిరి ఈ రోజు జనాల రద్దీ తక్కువగా ఉండటంతో నలుగురికే గాయాలయ్యాయని, లేకపోతే చాలా ప్రమాదం జరిగి ఉండదని స్థానికులు తెలిపారు..

Next Story