హత్య చేసి ఆపై ముక్కలుగా కోసి.. కారణమదేనా?

by Disha Web Desk 4 |
హత్య చేసి ఆపై ముక్కలుగా కోసి.. కారణమదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: వివాహేతర సంబంధాలు అనేక కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. వీటి కారణంగా తరచూ హత్యలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా దాచేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కోటేశ్వరరావు అనే వ్యక్తిని సైదులు అనే వ్యక్తి గొడ్డలితో ముక్కలుగా నరికి చంపారు.

హత్య అనంతరం శరీర భాగాలను తగల బెట్టాడు. దాచేపల్లి మోడల్ స్కూల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు సైదులు‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story