లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. సిట్ కస్టడీలోకి ఆ ముగ్గురు

by Kema Shiva Kumar |

వైసీపీ (YCP) ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు (Liquor Scam Case)లో నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court)లో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.

లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. సిట్ కస్టడీలోకి ఆ ముగ్గురు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP) ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు (Liquor Scam Case)లో నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court)లో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డిని 3 రోజుల పాటు.. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాలంటూ ఆ పిటిషన్‌లో న్యాయస్థానానన్ని అభ్యర్థించారు. అయితే, పూర్తి వాదనలు విన్న ఏసీబీ కోర్టు గురువారం నిందితులను రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తున్నట్లుగా పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే ఇవాళ, రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వారి న్యాయవాదుల సమక్షంలో మాత్రమే నిందితులను విచారించాలని సిట్ అధికారులకు సూచించింది. దీంతో ఈ మేరకు ఇవాళ అధికారులు నిందితులు రాజ్ కెసిరెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను ప్రత్యేక వాహనంలో విజయవాడ జిల్లా జైలు (Vijayawada District Jail) నుంచి విచారణ నిమిత్తం సిట్ కార్యాయానికి తరలించారు. అనంతరం కేసులో పలు అంశాలపై ప్రశ్నించి వారి స్టేట్‌‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు.

Next Story