కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్స్

by Kema Shiva Kumar |

పాలనాపరమైన వ్యవహాలకు సంబంధించి కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పాలనాపరమైన వ్యవహాలకు సంబంధించి కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఇప్పటి వరకు వెయిటింగ్‌లో ఉన్న పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్స్ ఇస్తూ.. సీఎస్ విజయానంద్ CS (Vijayanand) ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే సెటిల్‌మెంట్స్ డైరెక్టర్‌గా రోణంకి కూర్మనాథ్‌ను నియమించారు. ఇక తూర్పు గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా మేఘస్వరూప్‌ నియమితులయ్యారు. గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌గా అశుతోష్‌ శ్రీవాత్సవ, మన్యం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా యశ్వంత్‌ కుమార్‌, పాడేరు ఐటీడీఏ పీవోగా తిరుమణి శ్రీపూజ, సీసీఎల్‌ఏ జాయింట్‌ సెక్రటరీగా కల్పశ్రీ, రంపచోడవరం ఐటీడీఏ పీవోగా స్మరణ్‌రాజ్‌‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story