తిరుమల: న‌వంబ‌రు 20 నుండి కార్తీక దీపోత్సవాలు

by Disha Web Desk 10 |
తిరుమల: న‌వంబ‌రు 20 నుండి కార్తీక దీపోత్సవాలు
X

దిశ,వెబ్ డెస్క్: తిరుప‌తిలోని టీటీడీ పరిపాలన భవనంలో మంగ‌ళ‌వారం ఈవో కార్తీక దీపోత్సవాల ఏర్పాట్ల‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ న‌వంబ‌రు 20న తిరుప‌తి, 27న క‌ర్నూలు, డిసెంబ‌రు 4న వైజాగ్‌లో కార్తీక దీపోత్సవాలు నిర్వ‌హిస్తామ‌ని, దీనికోసం ఏర్పాట్లు చేప‌ట్టాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. దాత‌ల స‌హ‌కారంతో ఈ మూడు ప్రాంతాల్లో కార్తీక దీపోత్స‌వాలు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఆయా జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం స‌హ‌కారం తీసుకోవాల‌ని సూచించారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌య‌ ప్ర‌ధానార్చ‌కులతో సంప్ర‌దించి దీపోత్స‌వానికి అవ‌స‌ర‌మైన సామ‌గ్రిని సిద్ధం చేసుకోవాల‌న్నారు. ఆక‌ట్టుకునేలా సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని కోరారు. ఎక్కువ మంది భ‌క్తులు పాల్గొనేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు. ఈ స‌మీక్ష‌లో జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్‌ కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed