దస్తగిరికి భారీ భద్రత.. ఇంటి వద్ద తుపాకులతో పోలీసుల పహారా

by Disha Web Desk |
దస్తగిరికి భారీ భద్రత.. ఇంటి వద్ద తుపాకులతో పోలీసుల పహారా
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి పోలీసులు భారీ భద్రత పెంచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్ రెడ్డి, వైసీపీ కార్యకర్తల నుంచి తనకు ప్రాణహాని ఉందని కడప జిల్లా ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు చేశారు. అలాగే సీబీఐ ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. దస్తగిరికి 4 ప్లస్ 1 భద్రతను కల్పిస్తూ ఆదేశాలను జారీ చేశారు. దీంతో పోలీసులు బుధవారం సాయంత్రం 5 గంటలకు సెక్యూరిటీ విధుల్లోకి చేరారు. గురువారం ఉదయం దస్తగిరి ఇంటి వద్ద పోలీసులు హల్‌చల్ చేశారు. పోలీసులు తుపాకులతో పహారా కాస్తూ ప్రత్యక్షమయ్యారు. ఇప్పటికే దస్తగిరికి ఒక గన్ మెన్ ఉన్నాడు. తాజాగా 4 ప్లస్ 1 సెక్యూరిటీ కల్పించారు.

ఇవి కూడా చదవండి : High Court: ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ రద్దపై విచారణ వాయిదా

Next Story

Most Viewed