Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాటపై నేటీ నుంచి జ్యుడీషియ‌ల్ ఎంక్వైరీ!

by Y. Venkata Narasimha Reddy |

తిరుపతి(Tirupati)లో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Stampede)లో ఆరుగురు మరణించిన ఘటనపై నేటి నుంచి జ్యుడీషియ‌ల్ ఎంక్వైరీ ప్రారంభం(Judicial Inquiry Begins Today)కానుంది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి (Retired Judge Justice M. Satyanarayana Murthy)నేతృత్వంలోని కమిషన్ తొక్కిసలాట ఘటనపై పూర్తిస్థాయి విచార‌ణ జ‌ర‌ప‌నుంది.

Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాటపై నేటీ నుంచి జ్యుడీషియ‌ల్ ఎంక్వైరీ!
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Stampede)లో ఆరుగురు మరణించిన ఘటనపై నేటి నుంచి జ్యుడీషియ‌ల్ ఎంక్వైరీ ప్రారంభం(Judicial Inquiry Begins Today)కానుంది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి (Retired Judge Justice M. Satyanarayana Murthy)నేతృత్వంలోని కమిషన్ తొక్కిసలాట ఘటనపై పూర్తిస్థాయి విచార‌ణ జ‌ర‌ప‌నుంది. ఆరునెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిషన్‌కు ప్రభుత్వం సూచించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టోకెన్ల జారీ క్యూలైన్‌లో ఆరుగురు మరణించడం అదే తొలిసారి. జనవరి నెల 8వ తేదీన జరిగిన ఈ తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హుటాహుటిన తిరుపతి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఇద్దరు అధికారుల సస్పెన్షన్‌, ముగ్గురు అధికారుల బదిలీలు చేశారు. బాధిత కుటుంబాలకు టీటీడీ తరఫున నష్టపరిహారం సైతం చెల్లించారు. ఈ ఘటనపై మాజీ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించారు. తిరుపతిలోని పద్మావతి పార్క్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి టోకెన్ల కోసం ఎదురుచూస్తున్న ఆరుగురు భక్తులు మరణించడానికి దారి తీసిన పరిస్థితులేమిటో కమిషన్‌ విచారణ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

‘టోకెన్ల పంపిణీకి సరైన ఏర్పాట్లు చేశారో లేదో గుర్తించడంతో పాటు ఏకాదశి ఏర్పాట్లలో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా..? ఎలాంటి లోపాలున్నాయి..? అందుకు కారణమైన వ్యక్తులను గుర్తించాలని.. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలని.. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమల సందర్శించే భక్తులకు ఎలాంటి భద్రత కల్పించాలన్న దానిపై న్యాయ విచారణ కమిషన్ విచారించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. అలాగే సంస్థాగతంగా ఎలాంటి మార్పులు చేయాలన్న అంశంతో పాటు టీటీడీ ఉద్యోగులను ఏ విధంగా ఇలాంటి కార్యక్రమాలకు సన్నద్ధం చేయాలన్న దానిపైనా కమిషన్‌ సిఫారసులు చేయాలి’ అని ప్రభుత్వం సూచించింది. బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. న్యాయ విచారణ కమిషన్‌కు సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలను ప్రభుత్వం కట్టబెట్టడం విశేషం.

Next Story