Breaking: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు మళ్లీ వాయిదా

by Disha Web Desk 16 |
Breaking: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు మళ్లీ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు మళ్లీ వాయిదా పడింది. ఇరువర్గాల వాదనలు విన్న విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పును శుక్రవారం ఉదయం వెల్లడిస్తామని స్పష్టం చేసింది. చంద్రబాబు కస్టడీకి సంబంధించి ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఇవాళ తీర్పు వెల్లడించాల్సి ఉంది. కానీ ఇరు లాయర్లు మరోసారి వాదనలు వినిపించారు. కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపున లాయర్లు గట్టిగా వాదిస్తున్నారు. కేసులో ఆధారాలు లేనప్పుడు కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరపున లాయర్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. దీంతో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

Next Story