ఓటు వెయ్యరని తెలిస్తే మీ ఇల్లు తగలబెట్టేందుకు కూడా వైసీపీ సిద్దమే..

by Disha Web Desk 3 |
ఓటు వెయ్యరని తెలిస్తే మీ ఇల్లు తగలబెట్టేందుకు కూడా వైసీపీ సిద్దమే..
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీకి విపక్ష పార్టీలకి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. అయితే మాటల యుద్ధం ముదిరి అది కాస్త ఫ్లెక్సీ వార్ గా మారింది. అధికార పార్టీకి జనసేన పార్టీకి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా ఉంది ప్రస్తుతం పరిస్థితి. రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అడుగులేస్తున్న వైసీపీ.. ప్రచారంలో భాగంగా సిద్ధం హోర్డింగులు, ఫ్లెక్సీలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసింది.

కొన్ని చోట్ల చట్టవిరుద్ధంగా కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిందని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఇక అధికార పార్టీకి ఏ మాత్రం తగ్గకుండా జనసేన కూడా మేము సిద్దమే అంటూ హోర్డింగ్ లను ఏర్పాటు చేసింది. ఇలా వైసీపీకి, జనసేన కు మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. అయితే తాజగా X వేదికగా జనసేన పార్టీ ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో మచిలీపట్టణం లోని జనసేన పార్టీ ఆఫీసు ముందు వైసీపీ సైకోలు పిల్ల సైకోయిజం.

సైకో జగన్ చీకటి జీవోలు తెచ్చి రాష్ట్రాన్ని అంధకారం లోకి నెట్టడానికి సిద్ధమైయ్యాడు..సైకో కూలీలు చీకట్లో ప్రతిపక్ష నాయకుల ప్రచార బ్యానర్లు తగలబెట్టడానికి సిద్ధమైయ్యారు..రేపు ఓటు వెయ్యరు అని తెలిస్తే మీ ఇల్లు కూడా తగలబెట్టేస్తారు ఈ సైకోలు.. రాష్ట్రం నుండి తరిమెయ్యడానికి సంసిద్ధం కండి.. అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

Next Story

Most Viewed