టీడీపీ ఓట్ల బదిలీపై జనసేన నేత పోతిన మహేశ్ అనుమానం

by GSrikanth |   (  Updated:2024-03-15 07:38:48  IST  )

సీట్ల కేటాయింపుపై జనసేన నేత పోతిన మహేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.

టీడీపీ ఓట్ల బదిలీపై జనసేన నేత పోతిన మహేశ్ అనుమానం
X

దిశ, వెబ్‌డెస్క్: సీట్ల కేటాయింపుపై జనసేన నేత పోతిన మహేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. విజయవాడలో టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారు. ఇంత జరుగుతున్న టీడీపీ అధిష్టానం స్పందించకపోవడం బాధాకరమన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా మిగతా పార్టీలు కూడా ఈ పరిణామంపై స్పందించాలని డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షుడికే నిరసన తెలిపితే ఓట్ల బదిలీ ఎలా జరగుతుందని అనుమానం వ్యక్తం చేశారు.

దీనిపై జనసేన రాష్ట్ర నాయకత్వం కూడా స్పందించాలని కోరారు. కాగా, నిన్న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పిఠాపురం టీడీపీ నేతలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. వర్మ లాంటి కీలక నేత ఉండగా.. ఈ టికెట్‌న జనసేనకు ఎలా కేటాయిస్తారంటూ సొంత పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను పరిశీలించిన జనసేన నేత పొతిన మహేశ్ ఓట్ల బదిలీపై అనమానం వ్యక్తం చేశారు.

Read More..

Breaking News: వైసీపీ గూటికి టీడీపీ కీలకనేత.. కారణం ఇదే..!

Next Story