పొత్తులపై జనసేన చీఫ్ మరోసారి కీలక ప్రకటన.. విఘాతం కలిగించవద్దని సూచన

by Disha Web Desk 14 |
పొత్తులపై జనసేన చీఫ్ మరోసారి కీలక ప్రకటన.. విఘాతం కలిగించవద్దని సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో: పొత్తులపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన విడుదల చేశారు. జన హితానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది జనసేన పార్టీ అని స్పష్టం చేశారు. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. ఏపీ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళుతున్నామన్నారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించిన చర్యలు కొనసాగుతున్న ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దన్నారు.

పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలూ ప్రచారం చేయవద్దని సూచించారు. ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారవుతారని తెలిపారు. ఇందుకు సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా ఉంటే తన రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. తద్వారా ఆలోచనలు, భావోద్వేగాలు పార్టీకి చేరుతాయి. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ప్రకటనలు చేసే నాయకుల నుంచి వివరణ తీసుకోవలసిందిగా ఇప్పటికే కేంద్ర కార్యాలయానికి స్పష్టత ఇచ్చామని వెల్లడించారు. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించకమానరని, ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండడం అవశ్యమని సూచనలు చేశారు.

Next Story

Most Viewed