ఆ తప్పు మళ్లీ జరగదు..2024 ఎన్నికలపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

by Disha Web Desk 16 |
ఆ తప్పు మళ్లీ జరగదు..2024 ఎన్నికలపై పవన్ కల్యాణ్  కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: 2019 ఎన్నికల ఓటమిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిస్ కమ్యూనికేషన్ కారణంగా టీడీపీ, జనసేన వేరు వేరుగా పోటీ చేశాయని.. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఆయన వెల్లడించారు. విశాఖ జిల్లా టీడీపీ నేతలు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, పలువురు నేతలు ఇవాళ విశాఖలో పవన్‌తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 2019 నాటి తప్పులు మళ్లీ జరగకూడదనే టీడీపీతో పొత్తుపై ముందుగానే ప్రకటన చేశామని చెప్పారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడే పదవులు గురించి మాట్లాడమని తెలిపారు. పదవుల కంటే ముఖ్యం అధికారంలోకి రావడమని చెప్పారు. ఓట్ల వ్యవహారం, ప్రభుత్వ వైఫల్యంపై తన ప్రతీ విమర్శకు పక్కా ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన నాయకులు కేసులకు భయపడొద్దని.. తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పవన్ పిలుపు నిచ్చారు.

Next Story

Most Viewed