Janasena: వచ్చే ఎన్నికలపై రహస్య సర్వే.. దూకుడు పెంచిన జనసేనాని

by Disha Web Desk 16 |
Janasena: వచ్చే ఎన్నికలపై రహస్య సర్వే.. దూకుడు పెంచిన జనసేనాని
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన అక్కడ నుంచే పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేసిన ఆయన ఘోరంగా పరాజయం పాలయ్యారు. దీంతో ఈసారి సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ మేరకు అసలు పార్టీ బలమెంత తెలుసుకునే పనిలో పడ్డారు. ఏయే నియోజకవర్గంలో జనసేన గెలిచి అవకాశం ఉందనే అంశంపై రహస్యంగా సర్వే చేయిస్తున్నారట. జనసేన ఓటింగ్ శాతం ఎంతుంటుందనేది తెలుసుకుంటున్నారట. అలాగే అభ్యర్థులపై కూడా చర్చలు జరుపుతున్నారట. ఇప్పటికే రెండు రోజుల పాటు రహస్య మంతనాలు కూడా చేశారట. గతంలో కూడా పలు దఫాలుగా చర్చలు జరిపారట. దీంతో జనసేన వర్గాల్లో ఉత్కంఠ కలుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమంటున్న పవన్ మరి పొత్తుతో ఎన్నికలకు వెళ్తారా..?. లేదా ఒంటరిగా పోటీ చేస్తారా అనేది చూడాల్సి ఉంది.

Read more:

Ap News: ముందస్తు ఎన్నికలపై కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

రేపే టీడీపీ మహానాడు.. చంద్రబాబు ప్రసంగంపైనే అందరి దృష్టి


Next Story

Most Viewed