- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ దేశానికి క్షమాపణ చెప్పాలి : లోకేష్
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దేశానికి క్షమాపణ చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేసారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దేశానికి క్షమాపణ చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేసారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మన త్రివర్ణ పతాకాన్ని జెండా ఎగరవేయకపోవడం కేవలం అహంకారం మాత్రమే కాదు, మన దేశ స్వాతంత్ర్య సమరానికి తీవ్రమైన అవమానం అని మండిపడ్డారు. ఆయనకి ప్రజలు ఎలాగూ గుర్తు లేరు, ఇండిపెండెన్స్ డే కూడా గుర్తులేదా అని నిలదీశారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైతే మాత్రం స్వాతంత్య్ర దినోత్సవం ఎలా మర్చిపోతారని ప్రశ్నించారు.
దేశ స్వాతంత్య్రాన్ని అవమానించిన జగన్ యావత్ భారత దేశానికి క్షమాపణ చెప్పాలని లోకేష్ తో సహా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా నిన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జగన్ ఎలాంటి కార్యక్రమాలకు హాజరు కాకుండా ఇంటికే పరిమితం అయ్యారు.
Next Story






