విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్: రేపు వారి అకౌంట్‌లో నగదు జమ

by Disha Web Desk 21 |
ys jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28న చిత్తూరు జిల్లా నగరి నుండి జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ – జూన్ 2023 త్రైమాసిక లబ్ధిని ప్రారంభించే రాష్ట్ర స్థాయి కార్య క్రమాన్ని కంప్యూటర్‌లో బటన్ నొక్కి ప్రారంభించనున్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల పేద విద్యార్థుల ఉన్నత చదువులు వారి తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కాకూడదని,డిగ్రీ ఆపై చదువులు చదువు తున్న విద్యార్థులకు పేదరికమేకొలమానంగా కోర్సుతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ అందించే కార్య క్రమాన్ని ఫిబ్రవరి 24, 2020 న ప్రారంభించిందని, ఇందులో భాగంగా ఏప్రిల్ – జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ కింద జిల్లాలోని 34,388 మందికి విద్యార్థులు సంబంధించి 31180 మంది తల్లుల ఖాతాలకు రూ.22 కోట్లు జమ కానున్నదని కలెక్టర్ ఎస్ షన్మోహన్ తెలిపారు.

Read More : కాషాయం.. ఎవరి పక్షం! తేలుస్తుందా.. నాన్చుతుందా ?



Next Story

Most Viewed