వైఎస్ జగన్ కట్టుకున్నది ఇల్లు కాదు.. రాజకీయ సమాధి: RRR

by Jakkula.Mamatha |   (  Updated:2024-11-14 12:01:24  IST  )

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు(MLA Raghuramakrishnam Raju) ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

వైఎస్ జగన్ కట్టుకున్నది ఇల్లు కాదు.. రాజకీయ సమాధి: RRR
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు(MLA Raghuramakrishnam Raju) ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ గత ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌పై డిప్యూటీ స్పీకర్(Assembly Deputy Speaker) రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.500 కోట్లతో కట్టుకున్నది ఇల్లు కాదని, రాజకీయ సమాధి అని ఎద్దేవా చేశారు. ఆ ప్యాలెస్‌కు వచ్చిన నెగటివిటీ వల్లే మంచి ప్రభుత్వం వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దానిని రాష్ట్ర సంపదగా ప్రకటించాలి. టికెట్ పెట్టి సామాన్యులను అందులోకి అనుమతించాలి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుందని అన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన RRRకు పలువురు కూటమి మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story