రాష్ట్రంలో పోలీసులు ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
రాష్ట్రంలో పోలీసులు ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తు్న్నారని, కొంచెం ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిదని మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ తంబల్లపల్లి‌ గ్రామంలో గర్భిణీ‌పై దాడి చేయడం దారుణమంటూ ఖండించారు. గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో పాలనను భ్రష్టు పట్టిచారని ఆరోపించారు. ఇసుక దోపిడీ, దేవుళ్ల భూములు మాయం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికార పార్టీకి పోలీసులు సలాం కొడుతున్నారని, ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. కనీసం పోలీసులకు కూడా సీఎంగా ఉన్న జగన్ ఏమాత్ర మంచి చేయలేదని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2036 పోలింగ్ బూతుల్లో వెబ్ కాస్టింగ్ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఓటర్లు అందరూ ధైర్యంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి త్వరలో మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు.

Next Story

Most Viewed