- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సీఎం జగన్కు ఓటమి భయం పట్టుకున్నట్లుంది.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: ప్రస్తుతం పరిస్థితుల్లో టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి సీఎం జగన్కు అప్పుడే ఓటమి భయం పట్టుకున్నట్లుందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క ఛాన్సంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. ఒక్కడ చూసిన అవినీతే కనబడుతోందని, చివరకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ పేరుతో దండిగా దోచుకున్నారని ఆరోపించారు.
రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు వైసీపీ నేతలు ఎమ్మెల్యేలు తమను కోరుతున్నారని బుచ్చయ్య చౌదరి తెలిపారు. అభ్యర్థిని నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వస్తున్న అదరణ చూసి సీఎం జగన్కు అప్పుడే ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఈ సమయంలో ఆమోదింపజేశారంటూ సెటైర్లు వేశారు. జగన్ పాలనలో దళిత, బీసులు, బలహీవర్గాలపై దాడులు జరిగాయని అన్నారు. రాష్ట్రంలో రానుంది టీడీపీ ప్రభుత్వమేనని, తాము అధికారంలోకి రాగానే వైసీపీ అవినీతిని బట్టబయలు చేస్తామని బుచ్చయ్య చౌదరి వార్నింగ్ ఇచ్చారు.