- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడపలో అంతరాష్ట్ర దొంగల ముఠా హల్ చల్
కానిస్టేబుల్ పై దాడితో భయాందోళనలో నగరవాసులు.

దిశ, వెబ్ డెస్క్ : కడప (Kadapa) నగరంలో గత కొన్ని రోజులుగా అంతరాష్ట్ర దొంగల ముఠా (Group Of Thieves) హల్ చల్ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా గుర్తు తెలియని దుండగులు నగరంలోని పలు నివాసాలను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడ్డారు. నిద్రిస్తున్న కుటుంబాలను భయపెట్టి, ఇళ్లలోని బీరువాలను పగలగొట్టి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, దొంగలు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గస్తీ నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్ దొంగలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో దొంగలు అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు. దుండగులు కానిస్టేబుల్పై రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్ తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న కానిస్టేబుల్ను సహచర సిబ్బంది వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అంతరాష్ట్ర సరిహద్దులను అప్రమత్తం చేసి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.






