టీడీపీలో వర్గ విభేదాలు.. అబ్బాయ్ విజయాలకు బ్రేక్ వేయనున్నాయా..?

by Disha Web Desk 16 |
టీడీపీలో వర్గ విభేదాలు.. అబ్బాయ్ విజయాలకు బ్రేక్ వేయనున్నాయా..?
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. జిల్లాలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు, ఎంపీగా రామ్మోహన్‌గా ఉన్నారు. అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహనాయుడు వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి వరుసగా మూడోసారి ఎంపీ బరిలో ఉన్నారు. ఇప్పటికే రెండు సార్లు గెలిచిన ఆయన మూడో సారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు.

అయితే అంతర్గత విబేధాలు రామ్మోహన్ హ్యాటిక్ విజయాలకు బ్రేక్ వేస్తాయేమోనని రాజకీయనాయులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రామ్మోహన్‌ నాయుడుకు కొన్ని చోట్ల నుంచి అంసతృప్తుల బెడద ఉందని అంటున్నారు. ముందు నుంచి ఉన్న టీడీపీ ఇంచార్జులను కాకుండా రెబల్స్ నేతలకు ప్రమోషన్స్ ఇచ్చారట. దీంతో ఎంపీ రామ్మోహన్ నాయుడుకు టీడీపీ ఇంచార్జులు సహకరించమని అంటున్నారు. దీంతో వర్గ విభేదాలు రామ్మోహన్ నాయుడుకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని చెబతున్నారు. మరో వైపు బాబాయ్ అచ్చెన్నాయుడు మాత్రం దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ఇద్దరిలో వర్గ విబేధాలు ఎవరి విజయానికి గండి కొటతాయో చూడాలి.



Next Story

Most Viewed