AP News:పవన్‌ కళ్యాణ్‌పై నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Disha Web Desk 18 |
AP News:పవన్‌ కళ్యాణ్‌పై నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ,వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో పీఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి పిఠాపురం పైనే పడింది. నిన్న పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. సోదరుడు నాగబాబు, టీడీపీ పిఠాపురం ఇన్చార్జి వర్మతో కలిసి రిటర్నింగ్ అధికారులకు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఇది ఇలా ఉంటే రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌పై జనసేన నేత నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘నీ ఉద్దేశం ఏదైనా నీ ఆదేశం ఏదైనా ప్రశ్నించకుండా పాటించే లక్షలమంది జనసైనికుల్లో నేను ఒకడిని. ఎందుకంటే నీ నిర్ణయం నా భుజం మీద నీ చేయి లాంటిది. అది బలాన్ని , భరోసాని ఇస్తుందే తప్ప బరువుని, బాధని ఇవ్వదు’’. అని పేర్కొన్నారు. ఇక మరో వైపు మెగాస్టార్ రంగంలోకి దిగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ్ముడి గెలుపు కోసం పిఠాపురం నియోజకవర్గంలో చిరంజీవి రెండు రోజులు ప్రచారం నిర్వహిస్తారనే టాక్ వినిపిస్తుంది. ఇది ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed