సీఎం జగన్ పై దాడి చేసింది నేనే.. ఒప్పుకున్న మైనర్ బాలుడు

by Disha Web Desk 12 |
సీఎం జగన్ పై దాడి చేసింది నేనే.. ఒప్పుకున్న మైనర్ బాలుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మొత్తం సీఎం జగన్ పై జరిగిన రాళ్లదాడి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తుండగా నిందితులు రాళ్ల దాడి చేయగా.. సీఎం ఎడమ కనుబొమ్మ పై గాయం అయింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకొగా.. వారిలోని ఓ మైనర్ బాలుడు తాను రాయి విసిరినట్లు అంగీకరించారు. కాగా ఈ దాడికి సంబంధించి పోలీసులు అదుపులో ఉన్నవారంతా మైనర్లు కావడంతో.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా యువకుల సెల్ ఫోన్ లొకేషన్ తో పాటు కాల్ డేటా.. ఇతర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. కేవలం అనుమానంతో వడ్డెర కాలనీకి చెందిన యువకులను అదుపులోకి తీసుకున్నందుకు వారి తల్లిదండ్రులు.. ఆందోళనకు దిగారు.


Next Story

Most Viewed