- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నారా లోకేష్ పేరుతో భారీ సైబర్ క్రైమ్
by Muthe.Rajitha |
సైబర్ నేరగాళ్లు మరో దారుణానికి తెగబడ్డారు. ఏకంగా మంత్రి పేరుతో లక్షలు కాజేశారు.

X
దిశ, వెబ్ డెస్క్ : సైబర్ నేరగాళ్లు మరో దారుణానికి తెగబడ్డారు. ఏకంగా మంత్రి పేరుతో లక్షలు కాజేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ పేరుతో వాట్సాప్ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి.. బాధితులను బెదిరించి రూ.54 లక్షలు వారి అకౌంట్లో వేయించుకున్నారు. అయితే నిందితుల్లో ఇద్దరిని నేడు సీఐడీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా.. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈకేసుకు సంబంధించి బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గతంలోనే రాజేష్ A1 గా అరెస్ట్ చేసారు. రాజేష్ ను విచారించగా అతడు ఇచ్చిన సమాచారంతో నేడు సాయి శ్రీనాథ్, సుమంత్ లను అదుపులోకి తీసుకున్నారు.
Next Story






