- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.501 కోట్లు చెల్లింపు
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు కూటమి ప్రభుత్వం బకాయిల్లో ఇప్పటివరకు రూ.501 కోట్ల వరకు చెల్లించింది. పెండింగులో ఉన్న మొత్తంలో 'ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్ (టీబీడీఏ) విధానంలో రూ.1,000 కోట్లు చెల్లించాలని కూటమి ప్రభుత్వ నిర్ణయించింది

దిశ, ఏపీ బ్యూరో: ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు కూటమి ప్రభుత్వం బకాయిల్లో ఇప్పటివరకు రూ.501 కోట్ల వరకు చెల్లించింది. పెండింగులో ఉన్న మొత్తంలో 'ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్ (టీబీడీఏ) విధానంలో రూ.1,000 కోట్లు చెల్లించాలని కూటమి ప్రభుత్వ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎన్టీఆర్ వైద్యా సేవా ట్రస్టు, ఆసుపత్రుల యాజమాన్యాల మధ్య కుదిరిన ఒప్పందాలు అనుసరించి గత సోమవారం నుంచి చెల్లింపులు జరుగుతున్నాయి. మొత్తం 278 ఆసుపత్రుల యాజమాన్యాలకు కలిపి రూ.501 కోట్ల వరకు చెల్లింపులు జరిగినట్లు ఎన్టీఆర్ వైద్యా సేవా ట్రస్టు ఇంఛార్జి సీఈఓ, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు తెలిపారు. బిల్ డిస్కౌంటింగ్ విధానంలో బకాయిలు పొందేందుకు 873కుగాను 531 ఆసుపత్రుల యాజమాన్యాలు దరఖాస్తు చేశాయి. వీటిలో 336 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. బకాయిలపై ఆసుపత్రుల యాజమాన్యాలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చెల్లింపులు జరుగుతున్నాయి..






