జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు: ఆ కండీషన్ సరికాదన్న సీపీఎం నేత

by Disha Web Desk 21 |
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు: ఆ కండీషన్ సరికాదన్న సీపీఎం నేత
X

దిశ, డైనమిక్ బ్యూరో : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ఫ్రభుత్వం నిర్ణయించడం స్వాగతిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు అన్నారు. అదే సమయంలో ఇటీవల వచ్చిన జీవోలో ఉన్న కొన్ని అంశాలు ప్రభుత్వ ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగాలేవు అని చెప్పుకొచ్చారు. మొదటిది జర్నలిస్టులు 40% షేర్‌ ఇవ్వాలన్న నిబంధన సరికాదు అని అభిప్రాయపడ్డారు. స్థలం కోసమే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని కాబట్టి ప్రభుత్వమే గతంలో ఇచ్చినట్లు ఉచితంగా (నామినల్‌ రేట్‌కి) ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్రకార్యదర్శి వీ శ్రీనివాసరావు కోరారు. అలాగే ఇచ్చిన నిబంధనల్లో పేర్కొన్న అంశాల్లో జర్నలిస్టు భార్యకుగానీ, జర్నలిస్టుకుగానీ ఇల్లు ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలానికి అర్హులు కాదని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాదిమంది జర్నలిస్టులకు న్యాయం జరిగే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. ఇళ్ల స్థలాల విషయంలో జర్నలిస్టుకు సమాచార పౌర సంబంధాల శాఖ జారీచేసిన అక్రిడిటేషన్‌ను ప్రామాణికంగా తీసుకుని అర్హులను ఎంపిక చేసి వారికి స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ళ స్థలాల జిఓకు నెంబరు లేదు. నెంబరు కేటాయించాలని కోరుతున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed