దుండగుల దాడిలో గాయపడిన యువకుడిని పరమార్శించిన హీరో సాయిధరమ్ తేజ్

by Disha Web Desk 12 |
దుండగుల దాడిలో గాయపడిన యువకుడిని పరమార్శించిన హీరో సాయిధరమ్ తేజ్
X

దిశ, వెబ్‌ డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హీరో సాయి ధరమ్ తేజ్ తన మేనమామ పవన్ కల్యాన్ కోసం పిఠాపురంలో జనసేన తరుపున ప్రచారం చేశారు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై కూల్ డ్రింక్ బాటిల్ తో దాడి చేశారు. అయితే అది గమనించిన హీరో.. కిందకి వంగడంతో ఆ కూల్ డ్రింక్ బాటిల్ పక్కనే ఉన్న కార్యకర్తకు బలంగా తాకింది. దీంతో ఆ యువకుని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా ఈ రోజు హీరో సాయిధరమ్ తేజ్ దుండగులు దాడిలో గాయపడిన యువకుడిని ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. అలాగే అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని.. ఈ దాడి చేసిన వారికి మన గెలుపు తోనే సమాధానం ఇద్దామని ధైర్యం చెప్పారు. అనంతరం యువకుడికి ఆర్థిక సహాయం అందించి అతనితో కలిసి ఫోటో దిగి అనంతరం ప్రచారంలోకి వెళ్లిపోయారు.

Next Story