Ap: వల్లభనేనికి మరోసారి నిరాశ.. విచారణ వాయిదా

by srinivas |   ( Updated:2025-04-16 01:28:10.0  )
Ap: వల్లభనేనికి మరోసారి నిరాశ..  విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Gannavaram Former MLA Vallabhaneni Vamsi) బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు(Vijayawada SC and ST Court)లో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. గన్నవరం టీడీపీ(Tdp) కార్యాలయంపై దాడి వ్యవహారంలో సత్యవర్థన్‌ను కిడ్నాప్ నకు యత్నించారని వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడుపుతున్నారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టును వంశీ తరపున పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. బెయిల్ వస్తుందని ఆశ పడిన వంశీ అనుచరులకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది.

Next Story

Most Viewed