జీవీఎంసీ కౌన్సిల్‌లో గందరగోళం.. కార్పొరేటర్ల మధ్య తోపులాట

by Vemula.Srinu Prasad |

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది....

జీవీఎంసీ కౌన్సిల్‌లో గందరగోళం.. కార్పొరేటర్ల మధ్య తోపులాట
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం(GVMC Council Meeting) జరిగింది. ఈ సమావేశంలో కొంతసేపు గందరగోళం నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ(Tdp), వైసీపీ(Ycp) కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. స్టీల్ ప్లాంట్ ఇష్యూ పరిష్కారం అయ్యే వరకు కౌన్సిల్ అజెండాలోకి వెళ్లవద్దని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సభ్యులు తీర్మానం ప్రతిపాదిస్తే ఆమోదిస్తామని మేయర్ తెలిపారు. అయితే నాలుగు అంశాలను ప్రతిపాదిస్తూ వైసీపీ తీర్మానంపెట్టింది.

Next Story