వైసీపీకి మళ్లీ షాక్.. నలుగురు కీలక నేతలు జంప్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-22 10:53:57  IST  )

పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీకి షాక్ తగిలింది..

వైసీపీకి మళ్లీ షాక్.. నలుగురు కీలక నేతలు జంప్
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా వినుకొండ(Vinukonda)లో వైసీపీ(Ycp)కి షాక్ తగిలింది. నలుగురు కౌన్సిలర్లు(Councillors) పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం టీడీపీ(Tdp)లో చేరారు. ఈ సందర్భంగా పసుపు కండువాలు(Yellow Scarves) కప్పి నలుగురు కౌన్సిర్లను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు(Mla Gv Anjaneyulu) పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం పని చేయాలని టీడీపీలో చేరిన నలుగురు కౌన్సిలర్లకు ఆయన సూచించారు.

పార్టీల కతీతంగా పని చేయాలి


ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీల కతీతంగా పని చేయాలన్నారు. గత ఏళ్ల పాలనలో గుట్కా, గంజాయి రౌడీయిజం తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీలో చేరతామంటే ఎవరినైనా సరే తీసుకుంటామని జీవీ ఆంజనేయులు తెలిపారు.

Next Story