Tenali: ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై ఘోరం

by Disha Web Desk 16 |
Tenali: ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై ఘోరం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని రోజులుగా బాలికపై కన్నేసిన కామాంధుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. తెనాలి పట్టణానికి చెందిన కొప్పులరాజు 14 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పేవాడు. అయితే ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు బాలిక తెలియజేసింది. దీంతో బాధితురాలితో కలిసి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కొప్పుల రాజును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed