Mla Vs Ex Mla: పొన్నూరులో పొలిటికల్ హీట్

by Disha Web Desk 16 |
Mla Vs Ex Mla: పొన్నూరులో పొలిటికల్ హీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యపై మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. చేబ్రోలు మండలంలో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కిలారి రోశయ్య కనుసన్నల్లోనే గ్రావెల్ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. అంతేకాదు సీఎం వైఎస్ జగన్ ప్రమేయం సైతం ఉందని అందువల్లే తవ్వకాలు జరుగుతున్నాయని ధూళిపాళ్ల ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర గ్రావెల్ మాఫియా డాన్ అని ధ్వజమెత్తారు. దమ్ముంటే గ్రావెల్ మాఫియాపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ధూళిపాళ్ల నరేంద్ర సవాల్‌పై ఎమ్మెల్యే కిలారి రోశయ్య స్పందించారు. ప్రభుత్వ అనుమతులతోనే మైనింగ్ జరుగుతోందని తెలిపారు. అవినీతి జరిగిందని ధూళిపాళ్ల నిరూపించాలని ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఛాలెంజ్ చేశారు.



Next Story

Most Viewed